ఆ చిట్ట చివరి బండరాయి మీదెక్కి, గొంతెత్తి అరిచాడా అబ్బాయ్, ".....దేవుడా ఎందుకు పుట్టించావు నన్నీ ప్రపంచంలో.. నా తల్లిదండ్రులనే వాళ్ళని చూసుకునేందుకు నా కంటే సమర్ధవంతమైన ఆత్మ నీకు దొరకలేదా.. దేనికోసం నేను జీవించాలి నేనిష్టపడని ఈ లోకంలో.. అసలు నువ్వే ఉన్నావా.. లేవా.. నాకు నీ స్వర్గమూ వద్దూ, నీ నరకమూ వద్దు, ఆ రెంటిలో ఏదెప్పుడు ఎదురౌతుందో తెలియని ఈ భూమి అసలు వద్దే వద్దు.. నువ్వు నాకు సంజాయిషీ చెబుతావా లేదా.." పాపం కన్నీళ్ళపర్యంతమై చేస్తున్న ఆ రోధనాపూరిత ఆక్రందనకి ప్రక్కనే ఉన్న జంట పక్షులు భీతిల్లి ఎగిరిపోయాయి.. బండల మీదుగా వీస్తున్న కొండగాలి తనకేమీ తెలియనట్లు ఆక్రోశంతో ఊగిపోతున్న ఆ మనిషిని చల్లబరిచేందుకు ప్రయత్నిస్తుంది. అనుదైర్ఘ్య తరంగాలు అలసిపోయేంత దూరం వెళ్ళిన ఆ శభ్దం తమ కర్ణేంద్రియాలను చేరిన జీవులన్నీ ఉలిక్కిపడి తేరిపార చూశాయ్.. తన ప్రశ్నకి సంజాయిషీ కానీ, సమాదానం కానీ రావనే అనుమానం నిజమైందేమో.. అంతెత్తునుండి దూకేశాడా మనిషి... తనకి అక్కర్లేని భూమి నుండి తను కోరుకోని స్వర్గాన్నే చేరాడో, నరకాన్నే చేరాడో... చివరకి ఉన్నాడోలేడోఅని తను అనుమానించిన ఆ దేవున్నే చేరాడో...
ప్రాపంచికాలన్నిటీనీ వదలేసినా... ఆ ప్రేమపూరితమైన అనంత స్వరూపుడగు దేవుణ్ణి మాత్రం ఎందుకు నమ్మాడో ఆ జీవి
No comments:
Post a Comment